చంద్రబాబుకు మోహన్‌బాబు సవాల్‌..

చంద్రబాబుకు మోహన్‌బాబు సవాల్‌..
x
Highlights

సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్‌బాబు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుమారుడు విష్ణుతో కలిసి...

సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్‌బాబు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుమారుడు విష్ణుతో కలిసి లోటస్‌పాండ్‌కు వెళ్లి వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇన్నేళ్లకు మరో పార్టీలో చేరినట్టు వెల్లడించారు. అయితే గత కొన్ని రోజులుగా విద్యానికేతన్ విద్యా సంస్థలకు రావాల్సిన ఫీజు రియంబర్స్ మెంట్ విషయంపై తెలుగుదేశం ప్రభుత్వంపై మంచు మోహన్ బాబు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఫీజు రియంబర్స్ మెంట్ గురించి మాట్లాడతూ దాదాపు మూడు నాలుగేళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడాను. తరువాత ఉత్తరాలు రాశాను కానీ ఆయన సరిగ్గా స్పందించలేదని తెలిపారు. మట్టి, ఇసుక, భూములను దోచుకుని ఇప్పడు చంద్రబాబు భూస్వామి అయ్యాడన్నారు. గత 1975 నుంచి నా సంపాదన వివరాలు ఇస్తా, అదే నారా చంద్రబాబు నాయుడు ఇవ్వగలడా అని మోహన్‌బాబు సవాల్‌ విసిరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories