బాలింతను బలి తీసుకున్న కుళాయి ఘర్షణ

బాలింతను బలి తీసుకున్న కుళాయి ఘర్షణ
x
Highlights

కర్నూలు నగరంలో నీటి ఎద్దడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కుళాయి వద్ద నీరు పట్టుకునే విషయంలో జరిగిన ఘర్షణలో బాలింత మృతి చెందింది. కర్నూలులోని...

కర్నూలు నగరంలో నీటి ఎద్దడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కుళాయి వద్ద నీరు పట్టుకునే విషయంలో జరిగిన ఘర్షణలో బాలింత మృతి చెందింది. కర్నూలులోని లక్ష్మీనగర్‌కు చెందిన షేక్షావలి, షేకున్‌బీ దంపతుల కుమార్తె మౌలాబీకి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె రెండు నెలల క్రితం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు కోసం వచ్చి పుట్టింట్లోనే ఉన్నారు. కాలనీవాసులంతా కుళాయి నీళ్లను వంతుల వారిగా పట్టుకుంటారు. తల్లిదండ్రులు పనికి వెళ్లటంతో మౌలాబీ నీళ్ల కోసం కుళాయి వద్దకు వెళ్లారు. పక్క గుడిసెలో నివాసం ఉంటున్న రామచంద్రమ్మతో మాటామాటా పెరిగి గొడవ జరిగింది.

పని నుంచి తిరిగి వచ్చిన తల్లికి మౌలాబీ విషయం చెప్పటంతో మళ్లీ గొడవ మొదలయ్యింది. రామచంద్రమ్మ కుటుంబసభ్యులు షేకున్‌బీపై దాడి చేశారు తల్లిపై దాడిని అడ్డుకునేందుకు వచ్చిన మౌలాబీని వెనక్కి తోయటంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు రామచంద్రమ్మ, భర్త రత్నమయ్య, కుమార్తె మనీషాలపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories