ఏపీలో ఎవరు గెలుస్తారనిపిస్తోంది ?..కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్

ఏపీలో ఎవరు గెలుస్తారనిపిస్తోంది ?..కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్
x
Highlights

మొన్నటి వరకు ఏపీ రాజకీయాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్‌ సరదాగా నెటిజన్లతో...

మొన్నటి వరకు ఏపీ రాజకీయాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్‌ సరదాగా నెటిజన్లతో కాసేపు ట్విటర్‌ వేదికగా రాజకీయాల గురించి, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా అంశాలను పంచుకున్నారు. ఆన్ లైన్‌లో నెటిజన్లు అడిగే ప్రతీ ప్రశ్నకు కేటీఆర్ జవాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాపిక్‌గా మారిన ఏపీ రాజకీయాలపై కూడా నెటిజన్లు స్పందించారు. కేటీఆర్ ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఓ వ్యక్తి కేటీఆర్‌ను ఏపీలో ఎవరు గెలుస్తారనిపిస్తోంది సర్‌? మే 23 తర్వాత చంద్రబాబు పరిస్థితి ఏంటి ? అని ఓ ప్రశ్నను కేటీఆర్‌ను అడిగారు.

దీనికి స్పందిస్తూ కేటీఆర్ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. దాని కేటీఆర్ స్పందిస్తూ నాకు ఏపీ రాజకీయాలపై ఆసక్తిలేదండీ అని రిప్లే ఇచ్చారు. మరో వ్యక్తి ఏపీ నుంచి ఎవరు సీఎం అవుతారు సర్‌? దానికి కేటీఆర్‌ స్పందిస్తూ పోటీ చేసిన ఎమ్మెల్యేల నుంచి ఎవరైనా అవ్వచ్చు. కాగా వైసీపీ అధినేత జగన్‌ సీఎం పదవికి అర్హుడని అనిపిస్తోందా? దానికి కేటీఆర్ కేటీఆర్‌ అది ఏపీ ప్రజలు నిర్ణయిస్తారు. ఈ విషయంలో నా అభిప్రాయం ఎందుకు? అని అన్నారు. ఇక పనిలో పనిగా ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ ప్రస్తావన తెచ్చారు నెటిజన్లు కే ఏ పాల్‌ గురించి ఒక్క మాట చెప్పండి సర్‌. దానికి కేటీఆర్‌ ఆయన ప్రచార కార్యక్రమం చాలా వినోదాత్మకంగా ఉంది అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories