చెన్నైకి భారీ విజయం

చెన్నైకి భారీ విజయం
x
Highlights

ఐపీఎల్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. ముందుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20...

ఐపీఎల్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. ముందుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. చెన్నై ఆటగాళ్లు సురేష్ రైనా (37 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ ధోని (22 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదేశారు. ఢిల్లీ బౌలర్ సుచిత్‌కు 2 వికెట్లు దక్కాయి. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 16.2 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. దీంతో 80 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది చెన్నై జట్టు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (31 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకపోయింది . ఇమ్రాన్‌ తాహిర్‌ (4/12) తన సత్తా చూపించాడు. మరో స్పిన్నర్‌ జడేజాకు మూడు వికెట్లు లభించాయి. ధోనికి 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories