వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ..

వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ..
x
Highlights

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన మూడు రోజుల పాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా రెపో రేటులో పావు శాతం కోతను ప్రకటించింది. దీంతో...

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన మూడు రోజుల పాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా రెపో రేటులో పావు శాతం కోతను ప్రకటించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు ఏడాది తరువాత మళ్లీ 6 శాతానికి దిగివచ్చింది. ఇప్పటివరకూ 6.25 శాతంగా రెపో రేటు అమలవుతోంది. ఇందుకు ఎంపీసీ 4:2 వోటింగ్‌తో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఎంఎస్‌ఎఫ్‌తోపాటు.. బ్యాంక్‌ రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికిఎంపీసీ సవరించింది. అంతేకాకుండా బ్యాంకులు స్వల్పకాలిక నిధులను రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద డిపాజిట్‌ చేస్తే లభించే రివర్స్‌ రెపో రేటు సైతం 6 శాతం నుంచి 5.75 శాతానికి పరిమితంకానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories