కాంగ్రెస్‌ దగ్గర గులాబీని కట్‌ చేసే కత్తెర ఉందా?

కాంగ్రెస్‌ దగ్గర గులాబీని కట్‌ చేసే కత్తెర ఉందా?
x
Highlights

తెలంగాణలో అధికారపార్టీకి భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. టీఆర్ఎస్ నుంచి కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు హస్తం నేతలు పావులు...

తెలంగాణలో అధికారపార్టీకి భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. టీఆర్ఎస్ నుంచి కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు హస్తం నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. గులాబీ పార్టీలోని పలువురు అసమ్మతి నేతలు త్వరలోనే హస్తం గూటికి చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల రాహుల్ పర్యటన సందర్భంగా.. టీఆర్ఎస్‌లోని పలువురు నేతలను, కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్‌ను ఎదుర్కునేందుకు కలిసివచ్చే అన్ని అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది కాంగ్రెస్. తమకు బలమైన అభ్యర్ధులు లేని ప్రాంతాల్లో.. టీఆర్ఎస్ లోని అసమ్మతి నాయకులకు గాలం వేస్తోంది హస్తం పార్టీ. టికెటు ఖాయమనే హామీ ఇచ్చేసరికి.. నేతలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఓ సిట్టింగ్ ఎంపీ.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పలువురు కీలక నేతలు,

ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఓ మాజీ మంత్రి ..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ పీసీసీ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన రాములు నాయక్‌.. ఆ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్‌ఎస్ లో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని, అదో ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా తయారైపోయిందని ఆరోపించారు. షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండానే తనను సస్పెండ్‌ చేశారని రాములు నాయక్ కన్నీటి పెట్టుకున్నారు. పీసీసీ నేతలు మంగళవారం ఢిల్లీకి వెళ్లి, రాహుల్ తో చర్చించి.. వలస నేతల జాయినింగ్స్ పై క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. తమ పార్టీలోకి భారీ వలసలు ఉంటాయని.. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వీరి చేరికపైనే అనే చర్చ కూడా హస్తం పార్టీలో జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories