అసంతృప్తులపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం

అసంతృప్తులపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం
x
Highlights

రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తులపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. రెబల్స్‌గా పోటీ చేయాలని భావిస్తున్న అసంతృప్తులను బుజ్జగించేందుకు ప్రత్యేక...

రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తులపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. రెబల్స్‌గా పోటీ చేయాలని భావిస్తున్న అసంతృప్తులను బుజ్జగించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కర్నాటక మంత్రి శివకుమార్, పాండిచ్చేరి సీఎం నారాయణస్వామితో పాటు మంత్రి మల్లాది కృష్ణారావులతో కమిటీని ఏర్పాటు చేశారు. అసంతృప్తులతో స్వయంగా మాట్లాడనున్న కమిటీ సభ్యులు పార్టీకి సహకరించాలని కోరనున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే కమిటీ సభ్యులు బస చేయనున్నారు. జిల్లాల వారిగా అసంతృప్త నేతల జాబితాను సిద్ధం చేసిన నేతలు కమిటీ సభ్యులకు అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories