ఆళ్లగడ్డలో కొనసాగుతున్న హైటెన్షన్.. అనుచరులను కిడ్నాప్ చేశారని భూమా వర్గం ఆందోళన

ఆళ్లగడ్డలో కొనసాగుతున్న హైటెన్షన్.. అనుచరులను కిడ్నాప్ చేశారని భూమా వర్గం ఆందోళన
x
Highlights

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆహోబిలంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో మంత్రి అఖిలప్రియ సోదరి మౌనికారెడ్డి కారును...

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆహోబిలంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో మంత్రి అఖిలప్రియ సోదరి మౌనికారెడ్డి కారును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అయితే వైసీపీ నేతలు తమ అనుచరులను కిడ్నాప్ చేశారంటూ భూమా ఫ్యామిలీ మెంబర్స్‌ రోడ్డుపై ఆందోళనకు దిగారు. తమ అనుచరులను విడిచిపెట్టకపోతే గంగుల ఇంటి ముందు ధర్నా చేస్తామని అఖిలప్రియ సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డి, సోదరి భూమా మౌనిక కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.

అయితే ఏపీ పోలీసులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని అఖిలప్రియ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా తమ అనుచరుల్ని వైసీపీ అభ్యర్థి విజయేందర్ రెడ్డి చంపేస్తారని వారిని అప్పగించకపోతే ఆయన ఇంటి ముందే ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. అసలు తమకే రక్షణ లేకపోతే సామాన్యుడికి రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు మౌనిక. అసలు సీఐ కూడా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యమా ఇది వాళ్లు ఏమనుకుంటున్నారు.. ఇష్టానుసారం తిరుగుతున్నారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories