కాంగ్రెస్‌లో రెడ్డి దర్బార్‌... అత్యధికులు ఆ సామాజికవర్గీయులే!!

కాంగ్రెస్‌లో రెడ్డి దర్బార్‌... అత్యధికులు ఆ సామాజికవర్గీయులే!!
x
Highlights

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌లో కొన్ని సీమాజిక వర్గాలకు పెద్ద పీట వేయగా మరికొన్ని సామాజిక వర్గాల ఊసే అసలు కనిపించలేదు. కాంగ్రెస్ హైకమాండ్...

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌లో కొన్ని సీమాజిక వర్గాలకు పెద్ద పీట వేయగా మరికొన్ని సామాజిక వర్గాల ఊసే అసలు కనిపించలేదు. కాంగ్రెస్ హైకమాండ్ ఆచి తూచి సామాజిక వర్గాల వారీగా సీట్లు కట్టబెట్టింది. కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో అత్యధిక సీట్లు రెడ్డి సామాజిక వర్గానికే దక్కాయి. మొత్తం 65 స్థానాలకుగాను 23 స్థానాల అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గం వారు కావడం విశేషం. పైగా ఇందులో ఎక్కువ మంది నల్గొండ జిల్లా వారే కావడం మరో విశేషం. అలాగే 65 మందిలో 10 మంది మహిళలకు అవకాశమిచ్చారు.

ఇక కాంగ్రెస్ ప్రకటించిన 65 స్థానాల్లో బీసీలకు 13 సీట్లు దక్కాయి. ఇంకా ప్రకటించాల్సిన 29 సీట్లలో 12 సీట్ల వరకూ బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. వెలమవర్గం నుంచి ముగ్గురు, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి టికెట్లు ఇచ్చారు. నలుగురు ఆదివాసీలకు ఇద్దరు లంబాడా సామాజిక వర్గం వారికి కాంగ్రెస్ సీట్లు దక్కాయి. అయితే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్‌లో కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్కరికి కూడా సీటు దక్కలేదు. ఇక సీట్టింగ్ ఎమ్మెల్యేలందరికి మళ్ళీ సీట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్సీలు.. షబ్బీర్‌అలీ, ఆకుల లలిత, కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సీట్లు కేటాయించింది. అలాగే ముగ్గురు మాజీ ఎంపీలకు కూడా టిక్కెట్లు ఇచ్చారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories