డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు పెన్షన్

డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు పెన్షన్
x
Highlights

ఎన్నికల ఏడాదిలో సీఎం కేసీఆర్ మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు పెన్షన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్...

ఎన్నికల ఏడాదిలో సీఎం కేసీఆర్ మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు పెన్షన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు వెయ్యి రూపాయల పెన్షన్ ప్రకటించనున్నారు. 45 ఏళ్లు పైబడిన వారంతా ఈ పథకానికి అర్హులు. దీంతో రాష్ట్ర్రవ్యాప్తంగా ఉన్న 40 వేల మంది డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు ప్రయోజనం కల్గనుంది. డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వడం ద్వారా ఖజానాపై నెలకు 4 కోట్ల భారం పడనుంది. అయితే 40 ఏళ్లు నిండిన డప్పు, చెప్పులు కుట్టే వృత్తిదారులకు నెలకు 2 వేల పెన్షన్ ఇవ్వాలని ఆయా వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories