చంద్రగిరిలో పోలింగ్ అక్రమాలపై ఈసీ కొరడా

చంద్రగిరిలో పోలింగ్ అక్రమాలపై ఈసీ కొరడా
x
Highlights

చంద్రగిరిలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, పులివర్తిపల్లెలో పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అక్రమాల కేంద్ర ఎన్నికల సంఘం...

చంద్రగిరిలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, పులివర్తిపల్లెలో పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అక్రమాల కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో అక్రమాలకు అవకాశమిచ్చిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంది. పీవో, ఏపీవోలతోపాటు 10మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏప్రిల్ 11న ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. చంద్రగిరిలోని ఈ ఐదు గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. చెవిరెడ్డి ఫిర్యాదుపై రంగంలోకి దిగి విచారణ జరిపిన ఎన్నికల సంఘం నిన్న ఈ ఐదు గ్రామాలతో పాటు కాలేపల్లి, కుప్పం బాదూరులోనూ రీపోలింగ్ నిర్వహించింది. ఈసీ విచారణలో ఇక్కడ పోలింగ్ సందర్భంగా అక్రమాలు జరిగినట్లు తేలడంతో చర్యలు తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories