భార్య మరో వ్యక్తితో చాటింగ్‌.. కోపంతో భర్త...

భార్య మరో వ్యక్తితో చాటింగ్‌.. కోపంతో భర్త...
x
Highlights

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన దుర్గం మౌనికను కట్టుకున్న భర్తే హతమార్చాడు. భార్య మౌనిక తలపై ఇనుపరాడుతో...

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన దుర్గం మౌనికను కట్టుకున్న భర్తే హతమార్చాడు. భార్య మౌనిక తలపై ఇనుపరాడుతో గట్టిగ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇక వివరాల్లోకి వెళితే మౌనిక, శ్రావణ్‌లు ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు బాలురు ఉన్నారు. కాగా భార్యను డిగ్రీ చదివించిన శ్రావణ్‌ ఇటీవల లాసెట్‌ పరీక్ష కూడా రాయించాడు. అయితే ప్రస్తుతం శ్రావణ్‌ మాత్రం ఇంటివద్దే ఖాళీగా ఉంటున్నాడు. తన తండ్రి వారసత్వ ఉద్యోగం(సింగరేణి) కోసం వేచి చూస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో భార్య ప్రవర్తనపై పీకలదాక అనుమానం పెంచుకున్నాడు శ్రవణ్. తన భార్య రోజు మొబైల్‌లో వేరే వ్యక్తితో చాటింగ్‌ చేస్తోందని గొడవపడ్డ శ్రావణ్‌ ఏకంగా ఆమెను హత్య చేశాడు. అనంతరం హుటాహుటిన నేరుగా పోలీస్‌ ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.





Show Full Article
Print Article
Next Story
More Stories