టీడీపీ నేతలకు మావోయిస్టుల హెచ్చరికలు.. లిస్టులో ఓ మంత్రి

టీడీపీ నేతలకు మావోయిస్టుల హెచ్చరికలు.. లిస్టులో ఓ మంత్రి
x
Highlights

టీడీపీ నేతలను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. సీపీఐ మావోయిస్టు పార్టీ ఈస్ట్‌ డివిజన్‌ కార్యదర్శి కైలాసం పేరుతో లేఖను రాశారు. మంత్రి...

టీడీపీ నేతలను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. సీపీఐ మావోయిస్టు పార్టీ ఈస్ట్‌ డివిజన్‌ కార్యదర్శి కైలాసం పేరుతో లేఖను రాశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, గిడ్డి ఈశ్వరితో పాటు గిరిజన నేతలను లేఖలో హెచ్చరించారు. భద్రతా బలగాలు చేస్తున్న దాడులను అడ్డుకోకపోతే మన్యం ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని పేర్కొన్నారు. రాజ్యహింసలో భాగమైన టీడీపీ నాయకులపై ప్రజలు, మా పార్టీ తీసుకునే చర్యలకు, పర్యవసానాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గతంలో గనులు, అడవుల అంశంలో ఇదే తరహాలో సర్వేశ్వరరావు, సోమలను మావోయిస్టులు కాల్చి చంపారు. ఆ తర్వాత కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ కుమార్ మంత్రి అయ్యారు. అయితే, ఆరు నెలలలోపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోవడంతో ఇటీవలే శ్రావణ్ రాజీనామా చేశారు. మావోయిస్టుల లేఖతో పోలీసులు అప్రమత్తమయ్యారు.





Show Full Article
Print Article
Next Story
More Stories