జగనే రావాలి.. శత్రుశేషం ఉంచొద్దంటున్న వివాదాస్పద నటి

జగనే రావాలి.. శత్రుశేషం ఉంచొద్దంటున్న వివాదాస్పద నటి
x
Highlights

ఏపీ ఎన్నికల ఫలితాలు కోసం వేయి కళ్లతో ప్రజలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. ఫలితాలకు మరో 13రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఏపీలో...

ఏపీ ఎన్నికల ఫలితాలు కోసం వేయి కళ్లతో ప్రజలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. ఫలితాలకు మరో 13రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఏపీలో విజయకేతనం ఎగురవేసేది మేమేంటే మేమేనని ఎవరి లెక్కల్లో వారే ఉన్నారు. ఇక బెట్టింగ్ రాయుళ్ల గురించి చెప్పల్సిన పనిలేదనుకో ఎందుకంటే ఇప్పటికే బెట్టింగ్ రాయుళ్లు నియోజకవర్గాలు, కీలక నేతలపై జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు భానుడి భగ భగ, మరోవైపు ఏపీ రాజకీయ హీట్‌తో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో వివాదాస్పదలకు మరుపేరుగా, సంచలనలకు కేరఫ్ అడ్రస్‌గా నిలుస్తూ సోషల్ మీడియా, టీవీ ఛానల్స్‌లో తెగ హల్ చేసే భామా 'శ్రీ రెడ్డి' పొలిటికల్ అయినా సినీ రంగమైన అగ్గిరాజేయడాన్నే అలవాటుగా చేసుకుని తన పాపులారిటీ కోసం సోషల్ మీడియాని హీటెక్కించే శ్రీరెడ్డి తాజాగా ఏపీ ఫలితాల నేపథ్యంలో రాజకీయ వర్గాల మధ్య అగ్గిరాజేసే వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి.

జగన్ ఫోటోని షేర్ చేస్తూ 'మీరు రావాలి' అందరి లెక్కలు సరి చేయాలి. కావాలి జగన్. రావాలి జగన్. ఎవ్వరి శత్రుశేషం ఉంచొద్దు అంటూ కామెంట్స్ చేసింది. అయితే ఎన్నికల ముందు, తరువాత కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా పలు పోస్ట్‌లు చేసింది. ఎన్నికలు ముగిసిన తరువాత రాష్ట్రానికి కొత్త నాయకుడు వస్తే మరింత ఉపయోగం ఉంటుందని చాలా మంది జగన్ వైపు మొగ్గు చూపుతున్నారంటూ అభిప్రాయ పడింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి 60 శాతం ఛాన్స్ ఉండగా.. టీడీపీకి 40 శాతం అవకాశాలు ఉన్నాయి అంటూ లెక్కలు చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.







Show Full Article
Print Article
Next Story
More Stories