భర్త అక్రమసంబంధం పెట్టుకున్నాడని నడిరోడ్డుపై....

భర్త అక్రమసంబంధం పెట్టుకున్నాడని నడిరోడ్డుపై....
x
Highlights

తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో రమాదేవి అనే మహిళ నడిరోడ్డుపై ఓ యువతిని చావబాదిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. మరిన్ని వివరాల్లోకి...

తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో రమాదేవి అనే మహిళ నడిరోడ్డుపై ఓ యువతిని చావబాదిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా పెద్దపరినికి చెందిన సురేష్ కుమార్‌కు 9ఏళ్ల క్రితం రమాదేవితో పెళ్లైయ్యింది. సురేష్ విజయవాడలోని సన్‌రైజ్ ఆస్పత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వీళ్లకో బాబు ఉన్నాడు. అయితే సురేష్ కుమార్ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, మరో యువతితో సంబంధమే అందుకు కారణమని రమాదేవి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మందలించి వదిలేయడంతో స్వయంగా వాళ్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగింది రమాదేవి. గురువారం రాత్రి సురేష్ కుమార్ మరో యువతితో కనిపించడంతో యువతిపై దాడి చేసింది. స్థానికులు అడ్డుకుని యువతిని పోలీసులకు అప్పగించారు. ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తనకు న్యాయం చేయాలని రమాదేవి కోరుతుండగా, రమాదేవి తనను హత్య చేయాలని చూసిందని, కావాలనే నిందలు వేస్తోందని సురేష్ ఆరోపిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories