పెద్దపల్లిలో కాలిపోయిన వరిపంట..తీవ్ర మనో వేదనలో రైతులు

పెద్దపల్లిలో కాలిపోయిన వరిపంట..తీవ్ర మనో వేదనలో రైతులు
x
Highlights

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లొంక కేసరంలో విషాదం చోటు చేసుకుంది. 10 ఎకరాల్లో చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతైంది. మిట్టమధ్నాహం పోలాల్లో...

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లొంక కేసరంలో విషాదం చోటు చేసుకుంది. 10 ఎకరాల్లో చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతైంది. మిట్టమధ్నాహం పోలాల్లో మంటలు చెలరేగడంతో రైతులు ఏమి చేయలేకపోయారు. ప్రాణాలకు తెగించి మరీ ప్రయత్నం చేసినా 10 ఎకరాల్లో వరి కాలి బూడిద అయ్యింది. ఈ ఘటనలో రైతులు 15 లక్షల రూపాయల నష్టపోయారు. చేతి కాడికి వచ్చిన పంట నోటి కాడికి రాకుండానే పోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories