కోర్టులో భర్త చేసిన పనికి భార్య షాక్‌..

కోర్టులో భర్త చేసిన పనికి భార్య షాక్‌..
x
Highlights

తనతో విడాకులు తీసుకున్న భార్యను ఓ లాయర్ భర్త కొత్త పద్దతిలో ఇబ్బంది పెట్టాడు. నెలవారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని భార్య కోర్టుకు వెళ్లింది. దీంతో ఆ...

తనతో విడాకులు తీసుకున్న భార్యను ఓ లాయర్ భర్త కొత్త పద్దతిలో ఇబ్బంది పెట్టాడు. నెలవారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని భార్య కోర్టుకు వెళ్లింది. దీంతో ఆ భర్త కోర్టులోనే దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. ఈ ఘటన చండీగఢ్‌లో చోటు చేసుకుంది. 2014లో ఓ లాయర్ తన భార్య నుంచి వేరుపడి కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నాడు. భార్యకు నెలకు కొంత భరణంగా 25వేలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే రెండు నెలలుగా తన భర్త భరణం ఇవ్వటం లేదని భార్య కోర్టును ఆశ్రయించింది. కోర్టులో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమె భర్త డబ్బు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడే భార్యకు చుక్కెదురైంది. ఇవ్వాల్సిన 25వే రూపాయల్లో కేవలం నాలుగు వందలు మాత్రమే నోట్లుగా ఇచ్చి మిగిలిన 24,600కు రూపాయి, రెండు రూపాయల నాణేల చిల్లర రూపంలో ఇచ్చాడు. అంతే ఆ భార్య కోర్టులోనే గొల్లుమంది. భర్త తనను ఇబ్బంది పెట్టడానికే ఇలా చేస్తున్నాడని న్యాయమూర్తి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన వద్ద డబ్బులు లేవన్న భర్త వాదనను ఆమె తప్పుబట్టింది. కాగా లాయర్‌ భర్త తన పనిని సమర్థించుకుంటూ.. భరణం డబ్బులు ఇలా చిల్లర ఇవ్వకూడదని ఎక్కడా రాసిలేదని అన్నాడు. ఈ చిల్లర పనితో కంగుతిన్న న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories