జగన్ పై మోడీ ట్వీట్ కు అద్భుత స్పందన

జగన్ పై మోడీ ట్వీట్ కు అద్భుత స్పందన
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఎన్నికైన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రధాని మోడీ ని దిల్లీ వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే,...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఎన్నికైన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రధాని మోడీ ని దిల్లీ వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా ప్రధాని మోడీ జగన్ తో తన సమావేశం గురించి ట్విట్టర్ లో ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. "ఆంధ్రప్రదేశ్‌ కి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తానని హామీ ఇచ్చాను" అంటూ ప్రధాని చేసిన ట్వీట్ ఇపుడు నేట్టింట్లో సంచలనంగా మారింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు అద్భతంగా రియాక్ట్ అవుతున్నారు.

ప్రధాని మోడీ ఇంగ్లీషులో చేసిన ట్వీట్ కు ఇప్పటివరకూ 64 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 8,600 మంది రీట్వీట్‌ చేయగా, 1,800 మంది కామెంట్‌ చేశారు. ఇక అదే ట్వీట్ ను మోదీ తెలుగులోనూ చేయగా, 48 వేలకు పైగా లైక్స్, 6100 రీట్వీట్స్ వచ్చాయి. 1,500 మంది కామెంట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories