జగన్ సీఎం అవ్వడం ఖాయం : వంగా గీత

జగన్ సీఎం అవ్వడం ఖాయం : వంగా గీత
x
Highlights

ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతుంటడంతో రాజకీయ పార్టీ అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. రాష్ర్టంలో వైసీపీ అధికారం చేపట్టడాన్ని ఎవరూ ఆపలేరన్నారు కాకినాడ...

ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతుంటడంతో రాజకీయ పార్టీ అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. రాష్ర్టంలో వైసీపీ అధికారం చేపట్టడాన్ని ఎవరూ ఆపలేరన్నారు కాకినాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధి వంగా గీత. టీడీపీ ప్రభుత్వ వైఖరిపై ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉన్నారని వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ మెఖ్యమంత్రిని చేయలన్న ఆకాంక్షతో ప్రజలు ఉన్నారన్నారు. ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాట్ పోల్ రిజల్ట్స్ లోనూ ఎటువంటి మార్పు ఉండబోదంటున్నారు వైసీపీ నేత వంగా గీత. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజల కష్ట సుఖలు తెలుసుకొని వారికి అండగా నిలబడతారనే నమ్మకంతో జగన్‌ని ఏపీ సీఎం చేయలని డిసైడ్ అయ్యారని అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఏపీలో మే23న వైసీపీ జెండా రేపరేపలాడుతుందన్నారు. గత ఐదేండ్ల నుండి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పాలనలో ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్సోయారని అన్నారు. దివగంత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన మళ్లీ తిరిగి రాబోతుందనే ఏపీ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. ఏపీలో మార్పుకోరకు ప్రజలు కోరుకుంటున్నారని రాబోయే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయ ఢంకా మోగించడం ఖాయామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories