30న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం...మరి మంత్రులు?

30న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం...మరి మంత్రులు?
x
Highlights

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ వైసీపీ సునామీ కొనసాగింది. మొత్తం 25 స్థానాల్లో 22 సీట్లను వైసీపీ కైవసం...

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ వైసీపీ సునామీ కొనసాగింది. మొత్తం 25 స్థానాల్లో 22 సీట్లను వైసీపీ కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక టీడీపీ మూడు సీట్లలో గెలిచి పరువు నిలుపుకుంది. ఓవరాల్‌గా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఫ్యాన్‌ సునామీ సృష్టించింది. ఏపీలో జగన్ కేతనంతో చిత్తయి, బిత్తరపోయింది టీడీపీ పార్టీ. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్థమౌతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 30న విజయవాడలో జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం మాత్రం ఎక్కడ నిర్వహించాలన్న దానిపై తీవ్ర కసరత్తులు జరుగుతున్నాయి. సుమారు ఓ 20 ఎకరాల స్థలం ఉండేలా అధికారులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో చిన అవుట్‌పల్లి సిద్దార్థ మెడికల్ కాలేజీ ఎదుట ఖాళీ స్థలాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇగ అక్కడైతే ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అధికారులు చెప్పారు.

మరోవైపు ఈనెల మే 30న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత మంత్రులను ఎంపిక చేయనున్నారు వైసీపీ అధినేత. సీనియారిటీ, ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకు కొంచెం సమయం పట్టే అవకాశముండడంతో మొదట జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories