రెండు సీన్లకోసం 8 కోట్లా..

రెండు సీన్లకోసం 8 కోట్లా..
x
Highlights

ముఖ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందే 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తో. ఆ తరువాత స్టార్ హీరోలతో కొన్ని...

ముఖ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందే 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తో. ఆ తరువాత స్టార్ హీరోలతో కొన్ని సూపర్ హిట్ లు అందుకున్న మైత్రి వారి చేతిలో ఇప్పటికీ కొన్ని బడా ప్రాజెక్టులు ఉన్నాయి. న్యాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాను నిర్మిస్తున్న మైత్రి వారు టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తదుపరి సినిమా అయిన 'డియర్ కామ్రేడ్' ను కూడా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ సినిమాలో కథ బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగుతుందని ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని వార్తలు బయటకు వస్తున్నాయి. అంతేకాక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపిస్తాడని సినిమాలో కేవలం రెండు సన్నివేశాల కోసం నిర్మాతలు ఎనిమిది కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఫారిన్ నుంచి బైక్ రేసర్లు, డ్రోన్ లు, స్కార్పియో ఎక్విప్ మెంట్ సహా ట్రైనింగ్ ఉన్న వాళ్లను కూడా బరిలో దించుతున్నారట. అందుకే ఇంత భారీగా ఖర్చవుతోందని తెలుస్తోంది. ఏదేమైనా యువ హీరో సినిమా పైన ఇంత ఖర్చు పెట్టడం అంటే మైత్రి వారు గ్రేట్ అనే చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories