రేవంత్ రెడ్డికి మరో కీలక బాధ్యత అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్

x
Highlights

కాంగ్రెస్ హై కమాండ్ రేవంత్ రెడ్డికి మరో కీలక బాధ్యత అప్పగించింది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పగించిన అధిష్టానం ఇప్పుడు...

కాంగ్రెస్ హై కమాండ్ రేవంత్ రెడ్డికి మరో కీలక బాధ్యత అప్పగించింది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పగించిన అధిష్టానం ఇప్పుడు సోనియా సభ ఏర్పాట్ల బాధ్యతను రేవంత్ రెడ్డికి కట్టబెట్టింది. మేడ్చల్ లో జరిగే సోనియా సభ ఏర్పాట్లను పరిశీలించిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ నెల 23న తెలంగాణకు రానున్నారు. మేడ్చల్‌లో కాంగ్రెస్ నిర్వహించే భారీ బహిరంగ సభలో సోనియా ప్రసంగించనున్నారు. ఈ సభ నిర్వహణ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది.

సోనియా సభ ఏర్పాట్లను కీలక బాధ్యతగా తీసుకున్న రేవంత్ రెడ్డి మేడ్చల్ సభా స్థలానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ ప్రజల కలను సోనియా గాంధీ నెరవేరిస్తే ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందన్నారు. కష్టాలకోర్చి తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు రేవంత్ రెడ్డి. సోనియా సభకు లక్షలాది మంది తరలివస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ప్రజాకూటమిదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు సోనియా ఎన్నికల ప్రచార సభ పోస్టర్లలో మహిళ కాంగ్రెస్ నేతల ఫోటోలు లేకపోవడంపై దుమారం రేగుతోంది. పార్టీ నేతల తీరును స్టార్ క్యాంపెనర్ విజయశాంతి తప్పుబట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories