బీజేపీకి షాక్.. ఎన్డీయే కూటమికి మరో పార్టీ గుడ్‌బై...

బీజేపీకి షాక్.. ఎన్డీయే కూటమికి మరో పార్టీ గుడ్‌బై...
x
Highlights

బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మరో షాక్ తగిలింది. కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు భాగస్వామ్య పార్టీ అయిన బీహార్‌లోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ...

బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మరో షాక్ తగిలింది. కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు భాగస్వామ్య పార్టీ అయిన బీహార్‌లోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) ప్రకటించింది. సీఎం నితీశ్ కుమార్ వైఖరికి నిరసనగా... ఇవాళ పాట్నాలో జరుగుతున్న ఎన్డీయే సమావేశాన్ని కేంద్రమంత్రి, ఆర్ఎల్ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ బహిష్కరించారు. దీంతో ఎన్డీయే మిత్రపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తేవాలన్న బీజేపీ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్టైంది. 2019 ఎన్నికల్లో బీహార్ ఎన్డీయే సారథిని తానేనంటూ నితీశ్ కుమార్ ప్రకటించుకోవడంపై కుష్వాహ తీవ్రంగా కలత చెందినట్టు ఆర్ఎల్ఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలకు ఎన్నెన్ని సీట్లు ఇస్తారో నిర్ణయించాలని కూడా ఈ నెల 2న ఆర్ఎల్ఎస్పీ కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్డీయేకి గుడ్‌బై చెప్పిన ఆర్ఎల్ఎస్పీ... బీహార్ మహాకూటమిలో చేరేందుకు ఇప్పటికే ఆర్జేడీని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories