తెలంగాణలో 3 ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో 3 ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్‌ విడుదల
x
Highlights

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ పదవులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇవాళ్టి నుంచి 14 వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 15 న...

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ పదవులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇవాళ్టి నుంచి 14 వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 15 న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఈ నెల 17. ఈ నెల 31 న ఎన్నికలు నిర్వహించి జూన్‌ 3 న కౌంటింగ్‌ చేపడతారు. పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, పార్టీ మారిన కొండా మురళీధర్‌రావు పదవికి రాజీనామా చేయడం వల్ల స్థానిక సంస్థల కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. రాజీనామాచేసిన ఈ ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం 2022 జనవరి నాలుగో తేదీ వరకు ఉన్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories