మరో వరల్డ్ రికార్డ్ ను సృష్టించిన బాహుబలి

Highlights

బాహుబలి సినిమా విపరీతమైన అంచనాల మధ్య విడుదలై ఆ అంచనాలకు వందరేట్లకు మించి అలరించడమే కాదు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మరో రికార్డును...

బాహుబలి సినిమా విపరీతమైన అంచనాల మధ్య విడుదలై ఆ అంచనాలకు వందరేట్లకు మించి అలరించడమే కాదు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకొని వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

2015 జూలై 10 నాడు ఆరంభమైన ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే విశ్వ ప్రశ్నకు సమాధానంగా, దర్శక ధీరుడు రాజమౌళి విజన్ కు ప్రతి రూపంగా రూపొందిన దృశ్య కావ్యమే ఈ ‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం. సుమారు 5 ఏళ్ళ పాటు రాజమౌళితో సహా 900 మంది కాస్ట్ అండ్ క్రూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి రూ. 450 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి రూపొందించిన ‘బాహుబలి’ ప్రాంచైజీలో రెండవ, ఆఖరి భాగమైన ఈ చిత్రం శిఖరాగ్ర స్థాయి అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్నీ వర్గాల వారిని ఆకట్టుకుంది. దీంతో బాహుబలి రూ.1500కోట్లు, బాహుబలి -2 కూడా అదే స్థాయిలో వసూళ్లు రాబట్టిందని నేషనల్ మీడియా ఆకాశానికెత్తింది.

అంతేకాదు బాహుబలిని స్థాయిని మరింత పెంచేలా నేషనల్ మీడియా అవార్డ్ తో సత్కరించింది. నేషనల్ మీడియా సీఎన్ ఎన్ న్యూస్ ప్రతీ సంవత్సరంలో ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో వార్తల్లో ఎవరు ఎక్కువగా ఉంటే వారికి "ఇండియన్ ఆఫ్ ది ఇయర్". అలాగే ఈ సంవత్సరం కూడా ఆ అవార్డ్ ను ప్రధానం చేసేందుకు నటీ నటుల్ని ఎంపిక చేసింది. అందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్, "న్యూటన్" హీరో "రాజ్ కుమార్ రావ్", మరో ముఖ్యపాత్ర పోషించిన నటుడు "మయాంక్ తివారి"తో పాటు చిత్ర దర్శకుడు "అమిత్ మసూర్కర్" కూడా నామినీస్ గా ఎంపికయ్యారు,ఆఖరి నామినీ గా "టీం బాహుబలి" ని ఎంపిక చేసారు. ఇక్కడ బాహుబలి టీంను స్పెషల్ గా ఎంపిక చేసింది. ఎందుకంటే బాహుబలి టీం ను ఒక్కోక్కరిగా గుర్తించడం చాలా తప్పు. ఏ ఒక్కరి శ్రమ ని ప్రత్యేకించడానికి ఆస్కారం లేదు.,డైరెక్టర్ నుంచి స్పాట్ బాయ్ దాకా గుర్తింపు రావాలనే ఉద్దేశంతో బాహుబలికి స్పెషల్ గుర్తించారు. ఈ భూమ్మీద ఏ సినిమా అవార్డ్ కి ఏ కేటగిరి లో కూడా టీం మొత్తాన్ని నామినీ గా సెలెక్ట్ చేయడం జరగలేదు.ఈ లెక్కన ఇది కూడా ఒక కొత్త ప్రపంచ రికార్డ్ కి బాహుబలి తెర తీసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories