లగడపాటి రాజగోపాల్ సంచలన ప్రకటన..

లగడపాటి రాజగోపాల్  సంచలన ప్రకటన..
x
Highlights

ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్‌ సర్వేలకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. ఇకపై సర్వేలకు దూరంగా ఉంటానని ప్రకటించిన లగడపాటి ప్రజల...

ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్‌ సర్వేలకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. ఇకపై సర్వేలకు దూరంగా ఉంటానని ప్రకటించిన లగడపాటి ప్రజల నాడి తెలుసుకోవడం విఫలమైనందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు తన సర్వేలతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలని కోరారు. అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన లగడపాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని సూచించారు.

అయితే తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో ఆయన చెప్పిన లెక్కలు తారుమారు అయ్యాయి. తెలంగాణలోమహాకూటమి ప్రభుత్వంలోకి వస్తుందని లగడపాటి చెప్పారు. అయితే, ఆఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని లగడపాటి చెప్పారు. కానీ ఇక్కడ లడపాటి సర్వే పనిచేయలేదు ఫలితంగా వైసీపీ ప్రభంజనం సృష్టించింది. తన సర్వేల వలన ఎవరైనా నొచ్చుకుని ఉంటే మన్నించగలరని లగడపాటి కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories