అమిత్ షాతో సీఎం జగన్ భేటీ...ఏపీకి ప్రత్యేక హోదాపై కీలక చర్చలు

అమిత్ షాతో సీఎం జగన్ భేటీ...ఏపీకి ప్రత్యేక హోదాపై కీలక చర్చలు
x
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు పలువురు ఎంపీలతో కలిసి హోంశాఖ...

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు పలువురు ఎంపీలతో కలిసి హోంశాఖ కార్యాలయానికి చేరుకున్న జగన్ అమిత్‌షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని హామీలు, పెండింగ్ సమస్యలను అమిత్ షా దృష్టికి ముఖ్యమంత్రి జగన్ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన నివేదికను అమిత్‌షాకు అందజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించాల్సిందిగా అమిత్ షాను కోరారు. విభజన హామీలను వీలైనంత త్వరగా అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories