ఆశ్రమంలో మళ్లీ టెన్షన్...పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు

x
Highlights

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చినపొలమడ మళ్లీ రగులుతోంది. వారం రోజుల క్రితం అంటుకున్న చిచ్చు ఇంకా చల్లారలేదు. ప్రబోధానంద ఆశ్రమం దగ్గర తీవ్ర ఉద్రిక్త...

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చినపొలమడ మళ్లీ రగులుతోంది. వారం రోజుల క్రితం అంటుకున్న చిచ్చు ఇంకా చల్లారలేదు. ప్రబోధానంద ఆశ్రమం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆశ్రమంలోపల రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తుండగా అక్కడికి చేరుకున్న ఆందోళన కారులు రాళ్లతో దాడులు చేశారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని భద్రత కల్పిస్తున్నారు. మరోవైపు ఆశ్రమం చుట్టూ భక్తులు ఇనుప కంచెను ఏర్పాటు చేసి ఎవరినీ లోనికి అనుమతివ్వడం లేదు. ఆశ్రమ వ్యవహారాలన్నీ పారదర్శకంగానే జరుగుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు ఆశ్రమంలోనికి మీడియాను కూడా అనుమతించడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories