అమెరికాలో మరోసారి కాల్పులు.. 13 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు.. 13 మంది మృతి
x
Highlights

అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. దుండుగుడు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. ఈ ఘటన ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలోని థౌజెండ్‌ ఓక్స్‌ పట్టణంలో ఉన్న...

అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. దుండుగుడు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. ఈ ఘటన ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలోని థౌజెండ్‌ ఓక్స్‌ పట్టణంలో ఉన్న బార్డర్‌లైన్‌ బార్‌లో జరిగింది. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. థౌజెండ్‌ ఓక్స్‌ పట్టణానికి చెందిన ఓ కళాశాల చెందిన విద్యార్థులు పార్టీ చేసుకుంటున్నారు. ఆ కళాశాలకు పక్కనే ఉన్న బార్‌లో నుంచిపేలుళ్ల శబ్దం వినిపించడంతో కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.

కాల్పులు జరిగే సమయంలో వంద మందికి పైగా బార్‌లోనే ఉన్నారు. దుండగుడు ముందుగా గ్రెనేడ్లను బార్‌లోకి విసిరి ఆ తర్వాత కాల్పులు జరపడంతో అక్కడికక్కడే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించినట్టు సమాచారం. కాల్పులు జరుగుతున్నాయని సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేసుకుని దుండగుణ్ణి కాల్చి చంపారు. కాల్పులకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే గత నెల పిట్స్‌బర్గ్‌లోని యూదుల ప్రార్థనా మందిరంలోకి ఓ ఆగంతకుడు చొరబడి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories