మరొక రైటర్‌ని దర్శకుడిగా మార్చనున్న ప్రభాస్

మరొక రైటర్‌ని దర్శకుడిగా మార్చనున్న ప్రభాస్
x
Highlights

ఒక రైటర్ గా కెరీర్ ని ఆరంభించి ఇప్పుడు స్టార్ దర్శకుడిగా మారి పోయాడు కొరటాల శివ. రైటర్ గా ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ దర్శకుడిగా మారడం అంత సులువైన విషయం...

ఒక రైటర్ గా కెరీర్ ని ఆరంభించి ఇప్పుడు స్టార్ దర్శకుడిగా మారి పోయాడు కొరటాల శివ. రైటర్ గా ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ దర్శకుడిగా మారడం అంత సులువైన విషయం కాదు. పైగా రైటర్ టాలెంట్ ని నమ్మగలిగే హీరో కూడా ఉండాలి. వక్కంతం వంశీ ని నమ్మి అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' సినిమాలో నటించాడు కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలను అందించలేదు. మరోవైపు రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న కొరటాల మాత్రం ప్రభాస్ సపోర్టుతో 'మిర్చి' సినిమా కి దర్శకుడిగా మారాడు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరొక పాప్యులర్ రైటర్ దర్శకుడి అవతారం ఎత్తబోతున్నాడు.

అతను ఎవరో కాదు బుర్రా సాయి మాధవ్. కంచె సినిమా నుంచి ఎన్టీఆర్ బయోపిక్ వరకు బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన బుర్రా సాయి మాధవ్ కత్తి పదును కంటే తన పెన్ను పదును గొప్పదని ఇప్పటికి చాలాసార్లు నిరూపించాడు. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి బుర్ర సాయి మాధవ్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం 'సాహో' తో బిజీగా ఉన్న ఈ సినిమా తర్వాత ఒకవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూనే మరొక సినిమా వైపు కూడా లైన్లో పెట్టనున్నాడు. బుర్రా సాయి మాధవ్ సినిమా గురించి అధికారిక ప్రకటన కోసం కొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories