సోషల్ మీడియాకు అనసూయ గుడ్‌ బై

సోషల్ మీడియాకు అనసూయ గుడ్‌ బై
x
Highlights

ప్రముఖ యాంకర్‌ అనసూయ సోషల్ మీడియాకు గుడ్‌ బై చెప్పేసింది. రీసెంట్‌గా ఓ కుర్రాడు అన‌సూయతో సెల్ఫీ దిగేందుకు ప్ర‌యత్నించ‌గా, ఆమె సెల్ ప‌గ‌ల‌గొట్టింద‌ట‌....

ప్రముఖ యాంకర్‌ అనసూయ సోషల్ మీడియాకు గుడ్‌ బై చెప్పేసింది. రీసెంట్‌గా ఓ కుర్రాడు అన‌సూయతో సెల్ఫీ దిగేందుకు ప్ర‌యత్నించ‌గా, ఆమె సెల్ ప‌గ‌ల‌గొట్టింద‌ట‌. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా బుక్ అయింది. ఈ నేప‌ధ్యంలో అన‌సూయ‌కి భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నెటిజ‌న్స్ త‌మ‌కి న‌చ్చిన స్టైల్‌లో అన‌సూయ‌కి క్లాస్ పీకారు. క్లారిటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి వారు శాంతించక‌పోవ‌డంతో సోష‌ల్ సైట్స్ నుండి అన‌సూయ త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తుంది. ట్వీటర్‌తో పాటు ఫేస్‌ బుక్‌లో కూడా అనసూయ అకౌంట్ కనిపించటం లేదు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావటం వల్లే అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అన‌సూయ న‌టించిన గాయ‌త్రి చిత్రం ఫిబ్ర‌వరి 9న విడుద‌ల కానుండ‌గా, రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త పాత్ర పోషిస్తున్న‌ట్టు టాక్‌. శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న సచ్చిందిరా గొర్రె సినిమాలోను అనసూయ‌ కీలక పాత్రలో నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories