మళ్లీ కలిసి నటించనున్న అక్కినేని హీరోలు

మళ్లీ కలిసి నటించనున్న అక్కినేని హీరోలు
x
Highlights

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మనం' సినిమాలో అక్కినేని హీరోలు అందరూ ఒకేసారి తెరపై కనిపించిన సంగతి తెలిసిందే. అక్కినేని...

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మనం' సినిమాలో అక్కినేని హీరోలు అందరూ ఒకేసారి తెరపై కనిపించిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున నాగచైతన్య కలిసి నటించారు. అక్కినేని అఖిల్ కూడా ఈ సినిమాలో క్యామియో పాత్రలో కనిపించాడు. ఈ సినిమా బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య మరియు నాగార్జున కలిసి ఓ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున 'మన్మధుడు 2' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా పూర్తయిన తర్వాత నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయన' ప్రీక్వెల్ అయిన 'బంగార్రాజు' సినిమాలో నటించనున్నారు.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు చై. "నేను డాడీతో కలిసి 'బంగార్రాజు' సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమా స్క్రిప్టు పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి" అని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాక ఈ సినిమాలో అక్కినేని అఖిల్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు అని వార్తలు బయటకు వస్తున్నాయి కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమా జులై లో సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories