యాదాద్రి జిల్లాలో మరో దారుణం

యాదాద్రి జిల్లాలో మరో దారుణం
x
Highlights

మొన్నటి మొన్న యాదాద్రి జిల్లా హాజీపూర్‌లో సైకో శ్రీనివాస్ రెడ్డి చేసిన వరుస హత్యలు మరువక ముందే మరో ఘటన దారుణం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా...

మొన్నటి మొన్న యాదాద్రి జిల్లా హాజీపూర్‌లో సైకో శ్రీనివాస్ రెడ్డి చేసిన వరుస హత్యలు మరువక ముందే మరో ఘటన దారుణం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపూర్‌లో ఒంటరి మహిళను దుండగులు పాశవికంగా హతమార్చారు. ఇక వివరాల్లోకి వెళితే కర్రే అనురాధ అనే మహిళ స్థానికంగా మద్యం షాప్‌ నడిపిస్తోంది. అయితే అర్థరాత్రి ఎవరు లేని సమయంలో ఆ మహిళ ఇంట్లోకి దుండగులు ప్రవేశించి అత్యాచారం చేశారు. అరుపులు కేకలు వేస్తుందని అత్యాచారం ముగిసిన తరువాత వెంటనే ఆమెను హతమార్చారు. అనంతరం మహిళా ఇంట్లో ఉన్న నగలు, డబ్బు దోచుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున కర్రే అనురాధ మృతదేహన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటినా రంగంలోకి దిగిన క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది. కాగా దినికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు సైకో శ్రీనివాస రెడ్డిని సరూర్ నగర్ ఎస్ ఓటీలో ఇవాళ్టి నుంచి 13వ తేది వరకు పోలీసులు విచారించనున్నారు. హత్యాచారాలకు గురైన ముగ్గురు అమ్మాయిలతో పాటు మరికొంతమంది ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో శ్రీనివాస రెడ్డితో పాటు ప్రత్యక్ష సాక్షులు, స్నేహితులను ప్రశ్నించనున్నారు. నేరాల్లో శ్రీనివాస రెడ్డికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories