వైసీపీలో చేరిన కీలక నేత..

వైసీపీలో చేరిన కీలక నేత..
x
Highlights

మాజీ మంత్రి, కడప జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు డీఎల్‌ రవీంద్రారెడ్డి వైయస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మైదుకూరు బహిరంగసభలో ఆయనను వైసీపీలోకి...

మాజీ మంత్రి, కడప జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు డీఎల్‌ రవీంద్రారెడ్డి వైయస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మైదుకూరు బహిరంగసభలో ఆయనను వైసీపీలోకి ఆహ్వానించారు జగన్. అనంతరం రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. నా ప్రియ మిత్రుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమారుడు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. జరగబోయే ఎన్నికల్లో మైదుకూరు ఎమ్మల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి అవినాష్‌ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని రవీంద్రారెడ్డి కోరారు.

అంతేకాదు సాధారణంగా గ్రామాల్లో మాట్లాడుకుంటాం. అంటే ఇద్దరు మనుషులు కలిస్తే... నువ్వు నేను కలిస్తే...మనం అంటాం. అలాగే మనం... మనం కలిస్తే.... జనం అంటారు. ఇలాంటి జనం అంతా రాష్ట్రంలో కలిస్తే జగన్‌'' అని అంటారని డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories