చంద్రబాబు మళ్లీ చిటికెలేశారు: విజయసాయి రెడ్డి

చంద్రబాబు మళ్లీ చిటికెలేశారు: విజయసాయి రెడ్డి
x
Highlights

ఏపీ ఆపద్దర్మ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైపీసీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటక, తమిళనాడు,...

ఏపీ ఆపద్దర్మ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైపీసీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో నారా చంద్రబాబు నాయుడు అక్కడి ఓటర్లను చైతన్యవంతం చేయబట్టే పోలింగ్‌ శాతం పెరిగిందని చంద్రం సారు మళ్లీ చిలికెలేశారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు పర్యటించి ఓటర్లను చైతన్యవంతం చేస్తారట కేవలం రెండు వారాల్లోనే ఇంత ముందిరిపోయిందేమిటి బాబుగారూ? అని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వాధినేత అయి ఉండి ప్రతిదానికీ ప్రతిపక్షంపై నిందలు మోపడం సరికాదన్నారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోయినా, సీఎస్‌ రిటర్నింగ్‌ అధికారులతో సమీక్ష జరపినా మాకేం సంబంధం. కాగా ఎన్నికల పోలింగ్ ముగిసేంత వరకు అన్ని రకాల ప్రలోభాలకు పాల్పడింది మీరే కదా? అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.





Show Full Article
Print Article
Next Story
More Stories