సునామీ ప్రతాపం.. 62 మంది మృతి

సునామీ ప్రతాపం.. 62 మంది మృతి
x
Highlights

ఇండోనేషియాలో మరోసారి సునామీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 62 మంది ప్రాణాలు కోల్పోగా 650 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ సునామీ ప్రభావం సండా స్ట్రేయిట్‌...

ఇండోనేషియాలో మరోసారి సునామీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 62 మంది ప్రాణాలు కోల్పోగా 650 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ సునామీ ప్రభావం సండా స్ట్రేయిట్‌ ప్రాంతంపై ఎక్కువగా పడింది. సముద్రంలోని రాకాసి అలలు సండా స్ట్రేయిట్‌ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయని దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. క్రకటోవా అగ్నిపర్వతం బద్దలు కావడంతో సముద్రలోకి భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సముద్రంలో అలజడి రేగడంతో తీరంపై విరుచుకుపడ్డాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories