నాని, నాగార్జున కాంబినేష‌న్లో శ్రీరామ్ ఆదిత్య మ‌ల్టీస్టార‌ర్

నాని, నాగార్జున కాంబినేష‌న్లో శ్రీరామ్ ఆదిత్య మ‌ల్టీస్టార‌ర్
x
Highlights

టాలీవుడ్‌లో బ‌డా హీరోల‌ మ‌ల్టీస్టారర్స్ వ‌చ్చి చాలాకాల‌మే అయింది. శ‌మంత‌క‌మ‌ణిలో న‌లుగురు హీరోలు క‌లిసి న‌టించిన‌ప్ప‌టికీ చిన్న సినిమా కావ‌డంతో సినిమా...

టాలీవుడ్‌లో బ‌డా హీరోల‌ మ‌ల్టీస్టారర్స్ వ‌చ్చి చాలాకాల‌మే అయింది. శ‌మంత‌క‌మ‌ణిలో న‌లుగురు హీరోలు క‌లిసి న‌టించిన‌ప్ప‌టికీ చిన్న సినిమా కావ‌డంతో సినిమా హిట్ట‌యింది కానీ ఆ కాంబినేష‌న్‌కు ఆశించినంత పేరు రాలేదు. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు త‌ర్వాత ఆ స్థాయి మ‌ల్టీస్టార‌ర్ తెలుగులో ప్ర‌స్తుతానికి రాలేద‌నే చెప్పాలి. అయితే ఈ లోటును భ‌ర్తీ చేస్తూ ఓ క్రేజీ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌బోతోంది. వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న ఈత‌రం హీరో నాని, యాభై ఎనిమిదేళ్ల వ‌య‌సులో కూడా కుర్ర‌హీరోల‌తో పోటీ ప‌డి హిట్లు కొడుతున్న నాగార్జున క‌లిసి న‌టించ‌బోతున్నారు. ఈ మ‌ల్టీస్టార‌ర్‌కు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

శ‌మంత‌క‌మ‌ణి సినిమాతో ఈ డైరెక్ట‌ర్ రీసెంట్‌గా హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. నిర్మాత అశ్వినీద‌త్ ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీని తెర‌కెక్కించ‌నున్నారు. భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. రాజుగారి గ‌ది-2 షూటింగ్‌లో నాగార్జున‌, ఎంసీఏ సినిమా షూటింగ్‌లో నేచుర‌ల్ స్టార్ నాని బిజీగా ఉన్నారు. వీటి షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఇద్ద‌రు హీరోలు ఈ సినిమాలో న‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు ఇద్ద‌రినీ ఒప్పించిన‌ట్లు స‌మాచారం. ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు నిర్మాత అశ్వినీద‌త్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories