ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు వెల్లడి

ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు వెల్లడి
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలల్లోని ఉపాధ్యాయ విద్య కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2019 ఫలితాలు శుక్రవారం...

ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలల్లోని ఉపాధ్యాయ విద్య కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2019 ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు వీటిని ప్రకటించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఎడ్‌సెట్‌కు 14,019 మంది దరఖాస్తు చేయగా పరీక్షకు 11,650 మంది హాజరయ్యారు. మే 6న ఆంధ్రప్రదేశ్‌లో 16 ప్రధాన పట్టణాల్లోని 56 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈసారి ఎడ్‌సెట్ నిర్వహణ తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం చేపట్టింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారిలో పురుషులు 4,488 మంది ఉండగా.. మహిళలు 9,531 మంది ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories