ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. పాన్, ఆధార్ అనుసంధానానికి గడువు మరోమారు పొడిగింపు

PAN Aadhaar Link Deadline Is Now March 2023
x

ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. పాన్, ఆధార్ అనుసంధానానికి గడువు మరోమారు పొడిగింపు

Highlights

PAN-Aadhaar Link: ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.

PAN-Aadhaar Link: ట్యాక్స్ పేయర్లకు శుభవార్త. పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి సంబంధించి గడువును మరోమారు పొడిగించింది కేంద్రం. వాస్తవానికి ఈ ప్రక్రియకు 31 మార్చితో గడువు ముగియనుంది. కాగా గడువును మరోమారు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ అనుసంధానానికి వెసులుబాటు ఏర్పడింది. పర్మినెంట్‌ ఖాతా నంబరును ఆధార్‌తో అనుసంధానం చేసుకోనిపక్షంలో ఏప్రిల్‌ ఒకటి నుంచి 3 నెలల్లో, లేదా జూన్‌ 30 నాటికి అనుసంధానం చేస్తే 500 రూపాయలు, ఆ తర్వాత చేసే వారు వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయకపోయినా 2023 మార్చి వరకు పాన్‌ పనిచేస్తుందని, ఆ తర్వాత పనిచేయదని పేర్కొంది. కాగా ఈ అనుసంధాన ప్రక్రియకు తాజాగా మరోమారు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories