గృహ ప్రవేశానికి రావలసిందిగా జగన్ లేఖలు..

గృహ ప్రవేశానికి రావలసిందిగా జగన్ లేఖలు..
x
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మంగళగిరి సమీపంలోని తాడేపల్లిలో నూతన గృహ ప్రవేశం...

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మంగళగిరి సమీపంలోని తాడేపల్లిలో నూతన గృహ ప్రవేశం చేస్తున్నారని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అదే రోజు నూతన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభం ఉంటుందని సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, లోక్‌సభ సమన్వయకర్తలు, అసెంబ్లీ సమన్వయకర్తలకు జగన్ తరుపున లేఖలు పంపారు. కాగా కొన్ని అనివార్య కారణాల వలన ఈ నెల 13న ప్రకాశం జిల్లాలో జరగాల్సిన సమర శంఖారావం కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. అయితే 11వ తేదీన అనంతపురం జిల్లా కేంద్రంలో సమర శంఖారావం యథావిధిగా జరుగుతుందని సుబ్బారెడ్డి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories