నేడు మరోసారి చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం

Today once again Chandrababu and Pawan Kalyan joint campaign
x

నేడు మరోసారి చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం

Highlights

AP News: మధ్యాహ్నం 3 గంటలకు పెడనలో.. సా.6 గంటలకు మచిలీపట్నంలో చంద్రబాబు, పవన్ ప్రచారం

AP News: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా పెడన, మచిలీపట్నంలో రోడ్డు షో, బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సాయంత్రం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి పెడనకు ప్రత్యక హెలికాప్టర్‌లో రానున్నారు.

నాలుగు గంటలకు పెడన బస్ స్టాండ్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మచిలీపట్నంకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మచిలీపట్నంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెడనలో ప్రజాగళం సభ జరగనుంది. స్థానిక బస్టాండ్ సెంటర్ లో ఈ సభ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో వారాహి విజయభేరి సభ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories