మేరుగ నాగార్జునపై దాడి

మేరుగ నాగార్జునపై దాడి
x
Highlights

వేమూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లతో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. లోపల కూర్చున్న...

వేమూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లతో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. లోపల కూర్చున్న నాగార్జునకు స్వల్ప గాయాలయ్యాయి. ఆయనకు వెంటనే ప్రధమ చికిత్స చేసిన అనంతరం ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇటు గురజాల నియోజకవర్గం కూడా మేరుగ నాగార్జునపై టీడీపీ నేతల దాడిమేరుగ నాగార్జునపై టీడీపీ నేతల దాడిమారింది.

వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తలు ఇరువురు దాడులు చేసుకున్నారు. దీంతో వాహనాలు ధ్వంసం చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో స్వైర విహారం చేశారు. టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నాయకుడు యనుముల మురళీధర్ రెడ్డి సినిమాహాలు, ఆస్పత్రి, షాపులపై దాడులు చేశారు. అలాగే వైసీపీ నాయకులు కొందరు టీడీపీ వాళ్ళ ఇళ్లపై రాళ్లు రువ్వారు. దీంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందో అని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories