పిడుగురాళ్ల నుంచి జగన్ ప్రచారానికి శ్రీకారం

పిడుగురాళ్ల నుంచి జగన్ ప్రచారానికి శ్రీకారం
x
Highlights

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రాంభించనున్నారు. 16వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి...

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రాంభించనున్నారు. 16వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం వైఎస్‌ జగన్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారని ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘరాం స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో వైఎస్‌ జగన్‌ తొలిసభ ఉంటుందన్నారు.

వైఎస్‌ జగన్‌తోపాటు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆయన సోదరి వైఎస్‌ షర్మిల కూడా పార్టీ తరఫున ప్రచారం చేస్తారని రఘురాం చెప్పారు. వైఎస్‌ జగన్‌ తొలుత రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని.. 25వ తేదీ తర్వాత రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగిస్తారని తెలిపారు. పాదయాత్ర సాగని 41 నియోజకవర్గాలో వైఎస్‌ జగన్‌ ఎన్నికల పర్యటన ఉండేలా రూట్ మ్యాప్ తయారు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories