14న ఏపీ టెన్త్‌ పరీక్షా ఫలితాలు?

14న ఏపీ టెన్త్‌ పరీక్షా ఫలితాలు?
x
Highlights

ఏపీలో ఈ ఏడాది మార్చి- ఏప్రిల్‌ నెలల్లో జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షా ఫలితాలు ఈ నెల 14న విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా...

ఏపీలో ఈ ఏడాది మార్చి- ఏప్రిల్‌ నెలల్లో జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షా ఫలితాలు ఈ నెల 14న విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు. ఈనెల 23న సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అంతకుముందే పది ఫలితాలు విడుదల చెయ్యాలని విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 14 లేదా 15 తేదీల్లో పది ఫలితాలు విడుదల చెయ్యాలని భావిస్తోంది. ఇటీవల తెలంగాణలో ఇంటర్ ఫలితాల సందర్బంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు ఉన్నతాధికారులు నిర్వహించిన సమీక్షలో ఈ విషయంపై చర్చినట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories