టీడీపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి

టీడీపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి
x
Highlights

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్ నాయకురాలు పనబాక లక్ష్మీ దంపతులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి,...

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్ నాయకురాలు పనబాక లక్ష్మీ దంపతులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి పంపించారు. తన భర్త పనబాక కృష్ణయ్యతో కలిసి ఆమె చంద్రబాబును కలిసి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆమెకు తిరుపతి ఎంపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది.

ఒకవేళ కుదరకుంటే బాపట్ల ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు చంద్రబాబు ఒప్పుకున్నట్టు సమాచారం. మరోవైపు పనబాక చేరికతో బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి కూడా తానే పోటీ చేస్తానని మాల్యాద్రి చెబుతున్న వేళా పనబాక చేరిక కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే ఆయనకు గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ టిక్కెట్ కేటాయించారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories