ఏపీ అసెంబ్లీలో సెల్ ఫోన్లకు నో పర్మిషన్.. రూలింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని

No Permission for Cell Phones in the AP Assembly | AP News Today
x

ఏపీ అసెంబ్లీలో సెల్ ఫోన్లకు నో పర్మిషన్

Highlights

AP Assembly: స్పీకర్ రూలింగ్‌పై టీడీపీ సభ్యుల అభ్యంతరం

AP Assembly: అసెంబ్లీలోకి సెల్ ఫోన్లకు అనుమతి లేదంటూ స్పీకర్ తమ్మినేని రూలింగ్ ఇచ్చారు. సభలో జరగుతున్న రిణామాలను సెల్ ఫోన్లో రికార్డు చేసి మీడియాకు చేరవేస్తున్నారన్న సమాచారం తమకు ఉందని స్పీకర్ చెప్పారు. స్పీకర్ రూలింగ్ పై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు కూడా సెల్ ఫోన్లు తీసుకు వస్తున్నారని టీడీపీ సభ్యులు చెప్పడంతో ఎవరూ సెల్ ఫోన్లు సభలోకి తీసుకు రాకుడదని స్పీకర్ స్పష్టం చేశారు. సెల్ ఫోన్లను వాలంటరీగా సరెంర్ చేయాలని స్పీకర్ సభ్యులకు సూచించారు. సభలో సూచనలకు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని స్పీకర్ తమ్మినేని అన్నారు. మార్షల్స్ వారి విధులను వాళ్లు నిర్వహిస్తున్నారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories