Bus Yatra: సీఎం జగన్‌ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర..48 గంటల్లో ప్రారంభం

Memantha Siddham Bus Yatra in AP
x

Bus Yatra: సీఎం జగన్‌ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర..48 గంటల్లో ప్రారంభం

Highlights

Bus Yatra: మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర

Memantha Siddham Bus Yatra: నాలుగు సిద్ధం సభలు కంప్లీట్.. ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర.. ఏపీ సీఎం జగన్ బస్సుయాత్రకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరో 48 గంటల్లో జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.. మేమంతా సిద్ధం పేరుతో జనంలోకి వెళ్తున్నారు సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సు యాత్ర చేయనున్నారు.

నెల రోజుల పాటు కొనసాగే బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గాలు కవరయ్యేలా ఇప్పటికే రూట్ మ్యాప్‌ కూడా రెడీ చేశారు పార్టీ నేతలు. తొలి రోజు సాయంత్రం ప్రొద్దుటూరు బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. దీంతో బస్సుయాత్ర సభల్లో జగన్ ఏం మాట్లాడతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories