రేపు వైసీపీలోకి కొణతాల రామకృష్ణ, మాగుంట శ్రీనివాసులురెడ్డి

రేపు వైసీపీలోకి కొణతాల రామకృష్ణ, మాగుంట శ్రీనివాసులురెడ్డి
x
Highlights

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ , ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఎమ్మెల్సీ పదవికి, టీడీపీ...

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ , ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఎమ్మెల్సీ పదవికి, టీడీపీ సభ్యత్వానికి మాగుంట రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు చంద్రబాబు, కళా వెంకటరావుకు పంపించారాయన. మరోవైపు కొణతాల శుక్రవారం ఉదయం జగన్ ను కలవనున్నారు. ఇందుకోసం ఆయన వైజాగ్ నుండి హైదరాబాద్ బయలుదేరారు. గతంలో వైసీపీలోనే ఉన్న కొణతాల కొన్ని కారణాలతో వైసీపీని వీడారు. అయితే ఇటీవల చంద్రబాబును కలిశారు. దాంతో ఆయన టీడీపీలో చేరుతారని అందరూ భావించారు. అనూహ్యంగా జగనే స్వయంగా కొణతాలకు ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories