Tirumala: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు

Huge Traffic Jam at Alipiri as Devotees Rush Increase
x

Tirumala: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు

Highlights

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు.

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర వాహనాల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం టోకెన్ల సంఖ్య పెంచడం, కరోనా ఉద్ధృతి తగ్గడంతో తిరుమలకు వచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో వేలాది మంది భక్తులు వాహనాల్లో తరలివస్తున్నారు. ఇక అలిపిరి వద్ద ఒక్కసారిగా వందలాది వాహనాలు బారులు తీరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాధారణంగా తనిఖీలు చేసే 8 వరుసలు కాకుండా అదనంగా మరో నాలుగు వరుసల్లో తనిఖీలు ప్రారంభించారు. మరోవైపు అలిపిరి వద్ద వాహనాల రద్దీతో పాటు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories