Narsipatnam: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర పోలీసుల పహరా

High Tension in Narsipatnam Visakhapatnam District | Telugu Online News
x

విశాఖ జిల్ల నర్సీపట్నంలో టెన్షన్ టెన్షన్

Highlights

Narsipatnam: నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి నోటీసు అంటించిన పోలీసులు

Narsipatnam: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోసారి భారీగా పోలీసులు మోహరించారు. CRPF బలగాలు ఇప్పటికే నర్సీపట్నం చేరుకున్నాయి. ఏ సమయంలోనైనా అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అరెస్టును అడ్డుకునేందుకు అయ్యన్న ఇంటి వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన ఓ సమావేశంలో అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ కేసుకు సంబంధించిన నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని నల్లజర్ల పోలీసులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories